Thailand Open : థాయ్లాండ్ ఓపెన్లో భారత పోరాటం ముగిసింది. స్టార్ షట్లర్ సాయి ప్రణీత్ క్వార్టర్ ఫైన్లలో ఓటమి పాలయ్యాడు. వరల్డ్ 23 ర్యాంకర్ లీ షీ ఫెంగ్ (చైనా) 21-17, 21-23, 21-18తో ప్రణీత్పై విజయం సాధించాడు. గంట 24 నిమిషాలు జరిగిన మ్యాచ్లో అతను పోరాడినా ఫలితం లేకపోయింది. మొదటి గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న ప్రణీత్ ఒక్క సెట్ కూడా గెలవలేకపోయాడు. దాంతో, థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో ఇండియా పోరాటానికి తెర పడింది.
గత ఏడాది ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడిన ప్రణీత్ ఈ టోర్నీలో అద్భుత ఫామ్ కొనసాగించాడు. కొరియాకు చెందిన హయక్ జిన్ జియోన్పై 24-22, 7-21, 22-20తో గెలిచి క్యార్టర్ ఫైనల్ చేరాడు. పతకంపై ఆశలు రేపాడు. కానీ, క్యార్టర్ ఫైనల్లో లీ షీ రూపంలో అతనికి బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, సాత్విక్ – చిరాగో జోడీ పాల్గొనలేదు. ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో సాత్విక్ గాయపడ్డాడు. దాంతో, అతను థాయ్లాండ్ టోర్నీ నుంచి వైదొలిగాడు.