న్యూఢిల్లీ: అద్భుతమైన పంచ్లతో.. దీటైన డిఫెన్స్తో భారత బాక్సర్లు ప్రత్యర్థులను మట్టి కరిపించి థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో బంగారు పతకాలు కొల్లగొట్టారు. ఆరంభం నుంచి దూకుడైన ప్రదర్శనతో జైత్రయాత్ర సాగించిన గోవింద్ సహానీ (48 కి), అనంత ప్రహ్లాద్ చోప్డే (54 కి), సుమిత్ (75 కి) స్వర్ణాలతో మెరిశారు. టోర్నీలో పది పతకాలు (3 స్వర్ణం, 4 రజతం, 3 కాంస్యం) ఖాతాలో వేసుకున్న భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన పురుషుల 48 కిలోల విభాగం ఫైనల్లో గోవింద్ సహానీ 5-0తో నాథఫోన్ (థాయిలాండ్)ను పూర్తి ఆధిక్యంతో చిత్తు చేయగా.. 75 కిలోల బౌట్లో సుమిత్ 5-0తో ఆతిథ్య బాక్సర్ పీటాపట్ను మట్టికరిపించాడు. 54 కిలోల టైటిల్ పోరులో అనంత ప్రహ్లాద్ 5-0తో రిథియమన్(థాయిలాండ్)ను ఓడించి విజేతగా నిలిచాడు. సెమీస్లో తడబడిన ఆశీశ్ కుమార్, అమిత్ పంగల్, మోనిక, వీరేందర్ రజతాలు దక్కించుకున్నారు.