పుణె: అల్టిమేట్ ఖో-ఖో లీగ్లో తెలుగు యోధాస్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన తమ రెండో మ్యాచ్లో యోధాస్ 68-47 తేడాతో రాజస్థాన్ వారియర్స్పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి దూకుడు కనబరిచిన యోధాస్ తరఫున ఆదర్శ్ మోహిత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి అటాకర్ల నుంచి తప్పించుకుంటూ మూడు నిమిషాల 43 సెకన్ల పాటు ముప్పుతిప్పలు పెట్టాడు. కీలకమైన ద్వితీయార్ధంలో అటాకింగ్లో ఆదర్శ్(10 పాయింట్లు), ప్రసాద్ (13), రోహన్ (10) రాణించడంతో యోధాస్ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. మరోవైపు రాజస్థాన్ తరఫున కెప్టెన్ మజహర్ (17)ఆకట్టుకున్నా లాభం లేకపోయింది.