బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో 35-34తో జైపూర్ పింక్ పాంథర్స్పై నెగ్గి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో టైటాన్స్ డిఫెండర్ ఆదర్శ్ 9 పాయింట్లతో అదరగొట్టగా.. రజనీశ్ (7), సురేందర్ (4) రాణించారు. జైపూర్ తరఫున అర్జున్ (13), దీపక్ హుడా తీవ్ర పోరాటం చేశారు. మరో పోరులో హర్యానా స్టీలర్స్ 37-30తో పుణేరి పల్టన్పై విజయం సాధించింది.