కేపీహెచ్బీ కాలనీ: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో బరిలోకి దిగుతున్న తెలుగు టాలన్స్ జెర్సీని సోమవారం ఆవిష్కరించారు. జెఎన్టీయూహెచ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, వైస్చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, జట్టు యజమాని అభిషేక్రెడ్డి పాల్గొన్నారు. జైపూర్ వేదికగా ఈ నెల 8 నుంచి 25వ తేదీ వరకు జరిగే పీహెచ్ఎల్ అరంగేట్రం సీజన్లో తెలుగు టాలన్స్ సహా ఆరు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఈ సందర్భంగా శుభమ్ షియోరాన్ను జట్టు కెప్టెన్గా యజమాన్యం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, హ్యాండ్బాల్ అభ్యున్నతికి సహకారం మరువలేనిదని అభిషేక్రెడ్డి పేర్కొన్నారు.