షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పతకం ఖాయం చేసుకుంది. కాంపౌండ్ టీమ్ విభాగంలో ఓజాతో కలిసి జ్యోతి అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి-ఓజా జోడీ.. ఇటలీ జంటను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది.
తద్వారా భారత ఆర్చర్లు కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు. ఈ మెగాటోర్నీలో దేశానికి ఇదే తొలి పతకం కావడం విశేషం. శనివారం జరుగనున్న తుదిపోరులో కొరియా ఆర్చర్లతో మనవాళ్లు తలపడనున్నారు. ఒలింపిక్ కేటగిరీలో బరిలోకి దిగిన బొమ్మదేవర ధీరజ్-సిమ్రన్జీత్ కౌర్ 2-6తో ఇండోనేషియా ఆర్చర్ల చేతిలో ఓటమి పాలయ్యారు.