హైదరాబాద్: జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో సోమవారం జరిగిన 1500 మీటర్ల బాలికల ఫ్రీైస్టెల్ ఈవెంట్లో 15 ఏండ్ల వ్రితి 17.37.78 సెకన్ల టైమింగ్తో స్వర్ణ పతకంతో మెరిసింది. ఇప్పటికే 200మీటర్ల బట్టర్ఫ్లై ఈవెంట్లో పసిడి గెలిచిన వ్రితి ఖాతాలో రజతం, కాంస్యం కూడా ఉన్నాయి. మరోవైపు బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లెలో సాయి నిహార్ రజతం దక్కించుకున్నాడు.