లక్నో: జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ)లో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావు ముగింపు పలికారు. ఆదివారం లక్నోలో జరిగిన హెచ్ఎఫ్ఐ సర్వసభ్య సమావేశంలో మొత్తం 33 సంఘాలకు గాను 26 రాష్ర్టా సంఘాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. 23 రాష్ట్ర సంఘాలు ప్రత్యక్షంగా.. మరో మూడు సంఘాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్మోహన్రావును బలపర్చాయి. దీంతో గత కొన్ని రోజులుగా హెచ్ఎఫ్ఐలో నెలకొన్న సంక్షోభానికి చెక్ పెట్టినైట్లెంది. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ‘హెచ్ఎఫ్ఐని బాధ్యతాయుతంగా నడుపుతున్నాం. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాదికి చెందిన తెలుగు వ్యక్తి జాతీయ క్రీడా సంఘానికి అధ్యక్షుడు కావడం గిట్టనివాళ్లే అసత్య ఆరోపణలు చేస్తున్నారు’అని అన్నారు. తనకు మద్దతునిచ్చిన 26 రాష్ట్ర సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్లో సబ్ జూనియర్ నేషనల్స్
వచ్చే నెల 7-11 మధ్య హైదరాబాద్ వేదికగా బాలుర సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ నిర్వహించేందుకు సిద్ధమయ్యామని జగన్మోహన్రావు తెలిపారు. అంతేగాక కరోనా కారణంగా వాయిదాపడిన హ్యాండ్బాల్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్కూ అనుమతులు లభించాయని చెప్పారు.