న్యూఢిల్లీ: కర్ణీసింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతున్న జాతీయ ట్రయల్స్లో రాష్ర్టానికి చెందిన ఇషాసింగ్ పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణ పోరులో ఇషా 16-14తో దివ్య(కర్ణాటక)పై అద్భుత విజయం సాధించింది. యశస్విని సింగ్కు కాంస్య పతకం దక్కింది.