హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోవా వేదికగా జరుగుతు న్న 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ మోహన్హర్ష కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల టీ46 100మీటర్ల రేసును మోహన్ 11.25 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.
కాంస్యం సొంతం చేసుకున్న పారా అథ్లెట్ మోహన్ను జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.