హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న నాలుగో ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ జివాంజీ దీప్తి పసిడి పతకంతో మెరిసింది. టీ-20 విభాగంలో సత్తాచాటిన దీప్తి అగ్రస్థానం దక్కించుకుంది. జయంతి బెన్ (ఒడిశా), లలిత (ఆంధ్రప్రదేశ్) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో రాష్ర్టానికి చెందిన మోహన్ హర్ష స్వర్ణం దక్కించుకోగా, అబ్దుల్ ఖాదర్(తమిళనాడు), భవిక్ భర్వాద్ (గుజరాత్) రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.