న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ల కోసం ప్రకటించిన భారత మహిళల ఫుట్బాల్ జట్టులో తెలంగాణ యువ ప్లేయర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. వచ్చే నెలలో యూఏఈ, బహ్రెయిన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ల కోసం భారత మహిళ చీఫ్ కోచ్ థామస్ సోమవారం 23 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందులో సౌమ్యకు చోటు దక్కింది. ప్రస్తుతం జార్ఖండ్లో శిక్షణ పొందుతున్న భారత జట్టు వచ్చే నెల 2న యూఏఈకి బయలుదేరనుంది. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ.. ‘అమ్మాయిలు నెల రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిబిరం ముగియగానే స్నేహపూర్వక మ్యాచ్లు ఉండటం జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ మ్యాచ్ల్లో మనవాళ్ల ప్రదర్శనను బట్టి ఏ అంశాలపై దృష్టి సారించాలనేది పరిశీలిస్తాం. కరోనా కష్టకాలంలో మ్యాచ్లు ఏర్పాటు చేసిన అధికారులకు ధన్యవాదాలు’ అని అన్నారు.