Sai Sangeetha | హైదరాబాద్, ఆట ప్రతినిధి: జూనియర్ ఆసియా చాంపియన్షిప్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత అథ్లెటిక్స్ శిక్షణా శిబిరానికి తెలంగాణ యువ అథ్లెట్ దొడ్ల సాయిసంగీత ఎంపికైంది. దుబాయ్ వేదికగా ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్న జూనియర్ ఆసియా టోర్నీ కోసం బెంగళూరు సాయ్ కేంద్రంలో అథ్లెట్లు శిక్షణ పొందనున్నారు.
ఇందులో 62 మంది అథ్లెట్లు, 15 మంది కోచ్లు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి నాగపురి రమేశ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.