హైదరాబాద్, ఆట ప్రతినిధి: తిరుపతి వేదికగా జరిగిన 17వ సౌత్జోన్ త్రోబాల్ చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్యం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో తెలంగాణ పురుషుల జట్టు 15-9, 15-7తో కేరళపై అద్భుత విజయంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ధీరజ్, నితిన్ సాగర్..జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్ల్లో తెలంగాణ 15-12, 15-11తో కర్ణాటకపై, పుదుచ్చేరిపై 15-6, 15-9తో గెలిచి ముందంజ వేసింది.
అయితే కీలకమైన సెమీస్లో మన టీమ్ 11-15, 10-15తో తమిళనాడు చేతిలో ఓడి కాంస్య పోరుకు అర్హత సాధించింది. మరోవైపు మహిళల జట్టు లీగ్ దశ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టు సభ్యులను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ చారి అభినందించారు.