హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో మొత్తం 19 రాష్ర్టాల నుంచి 960 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన 68 మంది అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఆరు బంగారు, రజతం, రెండు కాంస్య పతకాలతో పాటు నాలుగు ట్రోఫీలు సాధించారు. ఈ నేపథ్యంలో పతకాలు సాధించిన వారిని హోమంత్రి మహమూద్ అలీ బుధవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ జితేందర్, ఐజీ రాజేశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.