హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఈనెల 19 నుంచి 29 వరకు జరుగనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొంటున్న్నారు. ఈ పోటీలకు ఎంపికైన వారికి శనివారం తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ (టీఎస్ఏ) సన్నాహాక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వారిని అభినందించిన సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి.. పతకాలు సాధించి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఏ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి ఉమేశ్, కోచ్ ఆయుశ్ యాదవ్, జియాన్ స్పోర్ట్స్ సీనియర్ కోచ్ జాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.