Vritti Agarwal | హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జ రుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో యువ స్వి మ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం జరిగిన మహిళల 200మీ ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి (2 ని.11.22 సె.) స్వర్ణంతో మెరువగా, అదితి (మహారాష్ట్ర), శ్రీచరణి (కర్ణాటక) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
మరోవైపు అదే జోరు కొనసాగిస్తూ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రితి (9.22.74) మరో పసిడి ఖాతా లో వేసుకుంది.