హైదరాబాద్, ఆట ప్రతినిధి: పారా ఖేలో ఇండియా టోర్నీలో తెలంగాణ షూటర్ ఆర్ జనార్ధన్ శ్రీధర్ డబుల్ ధమాకా మోగించాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఆర్4 విభాగంలో రజతం నెగ్గిన శ్రీధర్.. ఆర్ 5 విభాగంలో కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పారా షూటింగ్ ప్రపంచకప్నకు శ్రీధర్ అర్హత సాధించాడు.