హైదరాబాద్, ఆట ప్రతినిధి: చత్తీస్గఢ్ వేదికగా జరిగిన 42వ జాతీయ సబ్జూనియర్ బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తెలంగాణ రజత పతకంతో మెరిసింది. గత పదేండ్లలో తెలంగాణ జట్టు పతకం గెలువడం ఇదే తొలిసారి.
టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర జట్టులో ఏడుగురు ఎస్సీ సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉన్నారు. వీరిలో యశ్వంత్, అక్షయ్కుమార్, ఆకాశ్, పండరి, లక్ష్మినర్సింహ, సుశాంత్, వివేక్ సత్తాచాటారు.