హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన సౌత్జోన్ జాతీయ గోల్ఫ్ చాంపియన్షిప్లో తెలంగాణ ఎస్సీ గురుకుల విద్యార్థి అమూల్య టైటిల్తో మెరిసింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అమూల్య కీలక పాయింట్లు ఖాతాలో వేసుకంటూ అగ్రస్థానం సొంతం చేసుకుంది.
ఓవైపు ప్రత్యర్థి గోల్ఫర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగి టైటిల్ విజేతగా నిలిచిన అమూల్యను గురుకుల అధికారులు భాస్కర్, సత్యనారాయణ, నందిని, సురేశ్ అభినందించారు.