Monsoon Regatta | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు ధరణి లావేటి, వడ్ల మల్లేశ్, కొమరవెల్లి దీక్షిత తమ తమ విభాగాల్లో పసిడి పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు. హుస్సేన్ సాగర్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం అండర్-19 ఙంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ధరణి-మల్లేశ్ జంట సత్తాచాటింది.
మరో మూడు రేసులు మిగిలుండగా.. 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నాన్సిరాయ్-అనోరక్ షిండే, విద్యాన్షి మిశ్రా-మనీశ్ శర్మ జోడీలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. అండర్-15 అప్టిమిస్ట్ క్లాస్ బాలికల ఈవెంట్లో దీక్షిత 40 పాయింట్లతో టాప్ లేపి బంగారు పతకానికి చేరువైంది.