హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ ఆసక్తికరంగా సాగుతున్నది. గురువారం ఎమ్వైకే స్ట్రైకర్స్తో జరిగిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచిన శ్రీనిధి థండర్బోల్ట్స్ జట్టు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీనిధి ప్లేయర్లు ఆఖరి వరకు అదే దూకుడు కొనసాగించారు. మరోవైపు వ్యాలీ వారియర్స్తో జరిగిన పోరులో డేవ్పిక్సెల్ డెవిల్స్ ఐదు పాయింట్లతో ఘన విజయం సాధించింది.
రెండో రౌండ్లో అపోలో క్యాన్సర్ క్రూసేడర్స్తో పాయింట్లు పంచుకోవడం ద్వారా టీమ్ ఎమ్వైఎస్ 12 పాయింట్లతో గ్రూపు-డిలో టాప్లో కొనసాగుతున్నది. గ్రూపు-ఏలో విల్లాజియో హైల్యాండర్స్పై విజయంతో రెండు పాయింట్లు దక్కించుకున్న వర్ధమాన్ ఈగల్ హంటర్స్ 11 పాయింట్లతో నిలిచింది. గ్రూపు-బిలో క్లాసిక్ చాంప్స్ 10 పాయింట్లతో ఉండగా, గ్రూపు-సీలో టీమ్ ఎలిగన్స్, ఎమ్వైకే స్ట్రైకర్స్, మహి మాస్టర్స్ టీమ్, థండర్బోల్ట్స్ రెండేసి పాయింట్ల తేడాతో కొనసాగుతున్నాయి.