పనాజీ(గోవా): గోవా వేదికగా జరుగుతున్న 37వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు పతకాలు కొల్లడొడుతున్నారు. బుధవారం జరిగిన బాలుర యాచింగ్ ఐఎల్సీఏ-4 విభాగంలో రాష్ర్టానికి చెందిన విశ్వనాథ్ పడిదాల పసిడి పతకంతో మెరిశాడు.
మరోవైపు బాలికల ఐఎల్సీఏ-6 కేటగిరీలో అశ్విని రజత పతకం ఖాతాలో వేసుకుంది. 4 స్వర్ణాలు, 10 రజతాలు, 11 కాంస్యాలతో తెలంగాణ 22వ స్థానంలో ఉంది.