హైదరాబాద్: క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ తన ట్యాలెంట్తో స్టన్నింగ్ షో ఇచ్చిన విషయం తెలిసిందే. కెప్టెన్గానే కాకుండా కీలకమైన దశలో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. గోల్ పోస్టుపై దూకుడు పెంచుతూ ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. తన అసాధారణ స్కిల్స్తో మెస్సీ .. సెమీస్లో మాయ చేశాడు. అతని ఆట తీరు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నది. ఫుట్బాల్ ప్రేమికులు మెస్సీ మ్యాజిక్ చూసి స్టన్ అవుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా మెస్సి గేమ్కు ఫిదా అయ్యారు. ఆయన తన ట్విట్టర్లో మెస్సిని అమితంగా కొనియాడారు. అవసరమైన సమయంలో అవసరమైన వ్యక్తి వస్తాడని, అతనే మెస్సీ అంటూ తన ట్వీట్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Cometh the hour, cometh the man! Messi 🙏
— KTR (@KTRTRS) December 13, 2022
రసవత్తరంగా సాగిన ఫుట్బాల్ వరల్డ్కప్ తొలి సెమీస్లో అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో మెస్సి అత్యంత కీలకమైన గేమ్ ఆడారు. తొలుత 34వ నిమిషంలో పెనాల్టీ గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఇక క్రొయేషియా గోల్ పోస్టుపై పదేపదే దాడి చేస్తూ ప్రత్యర్థిని హడలెత్తించాడు. అల్వరేజ్ చేసిన రెండు గోల్స్కు కూడా మెస్సీనే కారణమయ్యాడు. మెస్సి ఇచ్చిన అద్భుతమైన పాస్లను అల్వరేజ్ గోల్స్గా మలిచాడు. దీంతో ఈజీగా ఫైనల్లోకి వెళ్లింది అర్జెంటీనా. మెస్సి అటాకింగ్ స్కిల్స్ ఆ జట్టును టాప్లో నిలిపింది.