ట్రోఫీ అందజేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్షిప్లో మను గందాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు జరిగిన టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన మను 23 అండర్ 257 స్కోరుతో టైటిల్ను నిలబెట్టుకున్నాడు. ముగింపు కార్యక్రమానికి క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్టుగా సీఎం కేసీఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా గోల్ఫ్ క్లబ్ను తీర్చిదిద్దుతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు గోల్ఫ్ కోర్స్ను అభివృద్ధి చేస్తున్నాం. టూరిజం, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో టోర్నీని ఘనంగా నిర్వహించాం’ అని అన్నారు. విజేత మనుకు మంత్రి రూ.6లక్షలు, రన్నరప్ యువరాజ్సింగ్కు రూ.4 లక్షల ప్రైజ్మనీ అందజేశారు.