హైదరాబాద్, ఆట ప్రతినిధి: అకోలా (మహారాష్ట్ర) వేదికగా జరిగే జాతీయ బాక్సింగ్ టోర్నీకి తెలంగాణకు చెందిన ఐదుగురు బాక్సర్లు ఎంపికయ్యారు. ఈ నెల 19న మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాక్సర్లు జాతీయ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు.
వీరిలో అనుముల సాయిభార్గవ్రెడ్డి, శ్రీకర్కుమార్, నిఖిల్గౌడ్, శ్రీశాంత్ పసిడి పతకాలతో మెరువగా, బాలాజీ రజతం దక్కించుకున్నాడు. వీరంతా ఈ నెల 24 నుంచి జరిగే జాతీయస్థాయి టోర్నీలో బరిలోకి దిగనున్నారు.