పాలకుర్తి, ఫిబ్రవరి19: అంతర్జాతీయ పరుగుపందెంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్నగర్ విద్యార్థి బొల్లు హరీశ్ సత్తాచాటాడు. నేపాల్ వేదికగా జరిగిన చాంపియన్షిప్ అండర్-17 బాలుర 400 మీటర్ల విభాగంలో హరీశ్ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకున్నాడు. నేపాల్కు వెళ్లేందుకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురైనా.. తల్లిదండ్రులు బొల్లు బుచ్చిబాబు, మల్లీశ్వరి ప్రోత్సాహంతో ముందడుగు వేసిన హరీశ్.. దాతలు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.