న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత జట్టులో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ చోటు దక్కించుకుంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో సోమవారం జరీన్ (52 కేజీలు)తోపాటు ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై (69 కేజీలు) సత్తాచాటి గాంగ్జూ ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. ఆసియా క్రీడలకు నిఖత్ అర్హత సాధించడంపై సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.