హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ అథ్లెట్లు అదరగొడుతున్నారు. బుధవారం వేర్వేరు క్రీడాంశాల్లో రాష్ర్టానికి నాలుగు పతకాలు దక్కాయి. జూడో బాలుర 50 కేజీల విభాగంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ (అదిలాబాద్)కు చెందిన లక్ష్మణ్ స్వర్ణ కాంతులు విరజిమ్మాడు. భోపాల్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీ ఫైనల్లో మహారాష్ట్ర ప్లేయర్ను చిత్తుచేసి లక్ష్మణ్ విజేతగా నిలిచాడు.
మహిళల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీైస్టెల్ విభాగంలో వ్రితి అగర్వాల్ (4 నిమిషాల 37. 28 సెకన్లలో) రజత పతకం కైవసం చేసుకోగా.. సాయి నిహార్ (4 ని. 43.81 సె.) కాంస్యం కొల్లగొట్టింది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన ప్రీతమ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక బాలుర రోయింగ్ టీమ్ ఈవెంట్లో శ్రవణ్కుమార్, సాయి వరుణ్, గణేశ్, జ్ఞానేశ్వర్తో కూడిన తెలంగాణ బృందం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజిక్కించుకుంది.