హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా, నిశిక అగర్వాల్ పతక జోరు కొనసాగుతున్నది.
మంగళవారం జరిగిన పురుషుల జూనియర్ సైక్లింగ్ 10కి.మీ స్క్రాచ్ ఈవెంట్లో ఆశీర్వాద్ 14.40.13 టైమింగ్తో పసిడి పతకం ఒడిసిపట్టుకున్నాడు. మహిళల అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ ఈవెంటో నిశిక అగర్వాల్ స్వర్ణంతో మెరిసింది.