మొహాలీ: భారత రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏఐ) కొత్త కార్యవర్గం కొలువు దీరింది. శనివారం జరిగిన ఎన్నికల్లో రణిందర్సింగ్ అధ్యక్ష స్థానాన్ని తిరిగి అధిష్టించాడు. అధ్యక్ష పోరులో రణిందర్ 56-3 తేడాతో బీఎస్పీ ఎంపీ శ్యామ్సింగ్ యాదవ్పై ఘన విజయం సాధించి వరుసగా నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తెలంగాణకు చెందిన అమిత్సంఘీ మరోమారు ఎన్ఆర్ఏఐ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు గుస్తీ జే నోరియా.. ఎన్ఆర్ఏఐ గవర్నింగ్ బాడీ సభ్యునిగా నియమితులయ్యారు.