న్యూఢిల్లీ: టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. భారత జట్టు ఫైనల్కు చేరడంలో ప్రధాన పాత్ర పోషించిన 33 ఏండ్ల షమీ.. ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మంగళవారం జరిగిన సర్జరీ విజయవంతమైందని షమీ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు.
అయితే కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో అతడు ఐపీఎల్లో ఆడటం అనుమానంగా మారింది. ‘నా మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. తిరిగి మైదానంలో దిగేందుకు ఎదురుచూస్తున్నా. అయితే కోలుకోవడానికి సమయం పడుతుంది’ అని షమీ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. మరోవైపు షమీ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా.. సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.