దుబాయ్: క్రికెట్లో చాలా రోజుల తర్వాత ఓ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 24 నుంచి టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) ప్రారంభం కాబోతోంది. అయితే అసలు టోర్నీకి ముందు ప్రధాన టీమ్స్ వామప్ మ్యాచ్లు ఆడనున్నాయి. టీమిండియా కూడా రెండు వామప్ మ్యాచ్లు ఆడబోతోంది. ఈ నెల 18, 20 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. 18న ఇంగ్లండ్తో, 20న ఆస్ట్రేలియాతో కోహ్లిసేన వామప్ మ్యాచ్లు ఆడనుంది.
18న ఇండియా మ్యాచ్తోపాటు ఆఫ్ఘనిస్థాన్, సౌతాఫ్రికా.. పాకిస్థాన్, వెస్టిండీస్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడతాయి. ఇక 20న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్తోపాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్.. సౌతాఫ్రికా, పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ ఆడనున్నాయి. ఇండియా ఆడే వామప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్లో ప్రసారం చేయనున్నారు.
టీమిండియా ప్లేయర్స్కు బ్రేక్ లేనట్లేనా?
ఇండియన్ ప్లేయర్స్కు వరల్డ్కప్కు ముందు అవసరమైన కీలక బ్రేక్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం మన ప్లేయర్స్ అంతా ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 15న ముగియనుంది. ఆ లెక్కన ఫైనల్కు క్వాలిఫై అయ్యే టీమ్స్లో ఆడబోయే ఇండియన్ ప్లేయర్స్కు వామప్ మ్యాచ్ కోసం కేవలం రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉండనుంది. వరల్డ్కప్లో భాగంగా ఈ నెల 24న పాకిస్థాన్తో తన తొలి మ్యాచ్లో టీమిండియా తలపడనుంది.