Team India : వెస్టిండీస్పై తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ (ICC Rankings)లో అగ్రస్థానానికి చేరిన విషయం తెలిసిందే. అయితే.. ఆ స్థానంలో భారత జట్టు ఉండేది కొన్ని రోజులే. ఒకవేళ రెండో టెస్టులోనూ గెలిచినా ఫస్ట్ ర్యాంక్ కోల్పోయే అవకాశం ఉంది. అదెలాగంటే..? ప్రస్తుతం భారత్ 121 రేటింగ్స్తో టాప్లో ఉంది. ఆస్ట్రేలియా(Australia) 116 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
అయితే.. యాషెస్ సిరీస్(Ashes Series)లో ఇంకా రెండు టెస్టులు ఉన్నందున కంగారు జట్టు భారత్ను వెనక్కి నెట్టే అవకాశం ఉంది. చివరి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ను ఓడిస్తే ఆసీస్ మళ్లీ నంబర్ 1 ర్యాంక్ దక్కించుకుంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం.
భారత జట్టు విండీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేస్తే .. ఆసీస్ 4-1తో యాషెస్ సిరీస్ నెగ్గాల్సి ఉంటుంది. అదే జరిగితే కమిన్స్ సేన మళ్లీ నంబర్ 1 అవుతుంది. దాంతో, టీమిండియా రెండో ర్యాంక్కు పడిపోతుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
వికెట్ తీసిన స్టార్క్కు సహచరులు అభినందన
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు డ్రాగా ముగిసిందనుకోండి.. దాని వల్ల ఆస్ట్రేలియాకే లాభం. అవును… మిగిలిన రెండు టెస్టుల్లో ఆ జట్టు ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకొని 3-1తో యాషెస్ సిరీస్ గెలిచినా అగ్రస్థానానికి చేరుతుంది. తొలి రెండు టెస్టులో ఇంగ్లండ్ బాజ్ బాల్ ఆటకు కళ్లెం వేసిన ప్యాట్ కమిన్స్ బృందం చివరి రెండు టెస్టుల్లోనూ నెగ్గే అవకాశం ఉంది. అలాకాకుండా ఇంగ్లండ్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా నంబర్ 1 అయ్యే అవకాశాలు తక్కువ.
తొలి టెస్టులో విండీస్ను దెబ్బకొట్టిన అశ్విన్
విండీస్ పుంజుకొని రెండో టెస్టులో గెలిస్తే 1-1తో సిరీస్ సమం అవుతుంది. అప్పుడు కమిన్స్ సేన అగ్రస్థానానికి చేరేందుకు రెండు చాన్స్లు ఉన్నాయి. ఒకటి… ఆఖరి రెండు టెస్టులు డ్రాగా ముగియాలి. దాంతో, ఆసీస్ 2-1తో యాషెస్ సిరీస్ సొంతం చేసుకుంటుంది. రెండోది.. ఆఖరి రెండు టెస్టుల్లోనూ కనీసం ఒకటి అయినా గెలిచి 3-2తో సిరీస్ దక్కించుకోవాలి.
యశస్వీ జైస్వాల్(171)
డొమినికా టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(171) సూపర్ సెంచరీకి తోడు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయంతో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25ను విజయంతో ఆరంభించింది. సిరీస్ డిసైడర్ అయిన రెండో టెస్టు జూలై 20న క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో జరుగనుంది.