దుబాయ్: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో అశ్విన్ 860 పాయింట్లతో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే అశ్విన్ టీమ్ఇండియాకు ఆయువుపట్టుగా మారాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు ర్యాంక్లు మెరుగుపర్చుకుని 826 పాయింట్లతో రెండో ర్యాంక్లోకి వచ్చాడు.
బుమ్రా (772), జడేజా (765) వరుసగా ఎనిమిది, తొమ్మిది ర్యాంక్ల్లో ఉన్నారు. బ్యాటర్ల ర్యాం కింగ్స్లో న్యూజిలాండ్కు చెంది న కేన్ విలియమ్సన్ (882) నంబర్వన్ ర్యాంక్లో ఉన్నాడు. నిలకడైన ఆటతీరుతో వరుస సెంచరీలతో అదరగొడుతున్న స్టీవెన్ స్మిత్ (882) నాలుగు ర్యాంక్లు మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. టాప్-10లో భారత్ తరఫున రిషబ్ పంత్ (758) ఒక్కడే కొనసాగుతున్నాడు.