కొలంబో: శిఖర్ ధవన్ సారథ్యంలో భారత పరిమిత ఓవర్ల జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. జూలై 13 నుంచి ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు ఆడేందుకు సోమవారం కొలంబో చేరుకుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. లంకలో ఈ పరిమిత ఓవర్ల టీమ్ను ధవన్ ముందుకు నడిపించనున్నాడు. దిగ్గజం రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా ఈ యువ జట్టుకు దిశానిర్దేశం చేయనున్నాడు.