గత ఆదివారం కరోనా బారిన పడి ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. గురువారం తర్వాత నిర్వహించిన రెండో కరోనా పరీక్షలో కూడా రోహిత్కు నెగిటివ్ వచ్చిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో అతడు ఇండియా-ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్కు సన్నద్దమవుతన్నాడని సమాచారం.
కెప్టెన్ అ.య్యాక తొలి విదేశీ పర్యటనకు వచ్చిన రోహిత్ శర్మకు ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. లీస్టర్షైర్తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్సం దర్భంగా రోహిత్ పాజిటివ్ అని తేలడంతో అతడు మూడో రోజు నుంచి గ్రౌండ్కు రాలేదు. అప్పట్నుంచి ఐసోలేషన్లోనే గడుపుతున్న హిట్ మ్యాన్.. ఆదివారం క్వారంటైన్ నుంచి కూడా బయటకు వస్తాడని తెలుస్తున్నది.
రోహిత్ గైర్హాజరీలో యువ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపిస్తున్నాడు. ఇండియా-ఇంగ్లాండ్ టెస్టులో రెండు రోజుల ఆట ముగిసే సమయానికి భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఈ టెస్టును మిస్ అయిన రోహిత్.. 7 నుంచి జరుగబోయే టీ20 సిరీస్కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.
జులై 7 నుంచి జరుగబోయే టీ20 సిరీస్కు బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది. ఇటీవలే ఐర్లాండ్తో సిరీస్లో ఆడిన జూనియర్ జట్టే ఇంగ్లండ్తో తొలి టీ20 ఆడుతుంది. వీరికి రోహిత్ శర్మ ఒక్కడే అదనంగా కలుస్తాడు. ఆ తర్వాత రెండు మ్యాచులకు మాత్రం భారత సీనియర్లు విరాట్ కోహ్లి, బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్లు జతకలుస్తారు. ఇంగ్లండ్తో జులై 7, 9, 10 లలో టీ20లు.. 12, 14, 17న మూడు వన్డేలు ఆడుతుంది రోహిత్ సేన.