టీ20 క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న జట్లలో భారత్ ఒకటి. ఆరంభం నుంచే బంతిని బాదేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎగ్రెసివ్ ఆటతీరు ఇప్పటి వరకు సత్ఫలితాలనే ఇచ్చింది. అయితే ఇంతకు ముందు కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు భారత జట్టు ఆటతీరు ఇలా ఉండేది కాదు. ఈ విషయాన్ని అప్పటి కోచ్ రవిశాస్త్రి కూడా అంగీకరించాడు.
తను కోచ్గా ఉన్నప్పుడు కూడా భారత టాపార్డర్ మెతకగా ఉందని అనుకునే వాళ్లమని, ప్రస్తుతం ఉన్న ఎగ్రెసివ్ ఆటతీరునే భారత్ కొనసాగించాలని రవిశాస్త్రి సూచించాడు. ‘‘జట్టు లోయర్ ఆర్డర్లో ఉన్న ఆటగాళ్ల సత్తాను దృష్టిలో పెట్టుకుంటే.. టాపార్డర్ రెచ్చిపోవాలి. కానీ నేను కోచ్గా ఉన్నప్పుడు అలా జరగలేదు. దీనిపై మేం కూడా చాలాసార్లు చర్చించాం.
ఇప్పుడు సరైన పద్ధతిలోనే టీమిండియా వెళ్తోంది. మధ్య మధ్యలో కొన్ని మ్యాచులు ఓడిపోతాం.. కానీ ఈ పద్ధతిలో గెలిస్తే ఆ కాన్ఫిడెన్స్తో కీలకమైన మ్యాచుల్లో కూడా ఇదే పద్ధతిలో ఆడొచ్చు’’ అని చెప్పాడు.