MS Dhoni : ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో అనూజ్ రావత్ను రనౌట్ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.
ఇప్పటి వరకు మొత్తం 251 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మిస్టర్ కూల్.. తాజా రనౌట్తో కలిపి 24 రనౌట్లు చేశాడు. అంతకుముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడేజా 227 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి మొత్తం 23 రనౌట్లు చేశాడు. తాజా రనౌట్తో జడేజా ఆల్టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేశాడు.
కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంఎస్ ధోని తప్పుకున్నాడు. తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. రుతురాజ్ సారథ్యంలో ఈ సీజన్లో సీఎస్కే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.