Team India : కొత్త ఏడాది ఆరంభంలోనే భారత జట్టు(Team India) టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతాన్ని ఆవిష్కరించింది. పేసర్లకు స్వర్గధామమైన కేప్టౌన్(Kape Town)లో సంచలన విజయంతో సిరీస్ కాపాడుకుంది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో టీమిండియా నయా చరిత్ర లిఖించింది. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యల్ప బంతుల్లోనే గెలుపొందిన జట్టుగా నిలిచింది. కేప్టౌన్లో భారత్ 107 ఓవర్లలో.. అంటే 642 బంతుల్లోనే విజయ ఢంకా మోగించింది. దాంతో, ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును రోహిత్ సేన బద్ధలు కొట్టింది.
గతంలో ఆస్ట్రేలియా 109.2 ఓవర్లనే దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. 1932లో సఫారీలపై ఆసీస్ స్పిన్నర్ బెర్ట్ ఐరన్మాంగర్ 11 వికెట్లతో చెలరేగాడు. దాంతో, కంగారూ జట్టు 656 బంతుల్లోనే విజయం సాధించింది. 80 ఏండ్లుగా చెక్కు చెదరని ఈ రికార్డును కేప్టౌన్ టెస్టులో భారీ విజయంతో టీమిండియా బ్రేక్ చేసింది.
Only the second time India leave South Africa with a shared Test 🏆
The previous one had come in 2010 under MS Dhoni#SAvIND pic.twitter.com/ctdCxsrUf4
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2024
1934లో వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ 112 ఓవర్లలోనే ముగిసింది. 1888లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్లో 788 బంతుల్లోనే ఫలితం తేలిపోయింది. అదే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్లో జరిగిన మ్యాచ్ 792 బంతుల్లోనే ముగిసింది.
Rohit rejoices after Iyer produced the winning shot 👊 #SAvIND
(Ctsy: @StarSportsIndia) pic.twitter.com/JMDFZkn46i
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2024
కేప్టౌన్లో జరిగిన సిరీస్ డిసైడర్లో భారత బౌలర్లు బుమ్రా(8), సిరాజ్(7) వికెట్లతో చెలరేగారు. దాంతో, టీమిండియా 7 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించి సిరీస్ సమం చేసింది. రెండో ఇన్నింగ్స్లో మర్క్రమ్(106 103 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో భయపెట్టినా.. బుమ్రా విజృంభణతో సఫారీ జట్టు 176 పరుగులకే కుప్పకూలింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ 3 వికెట్ల నష్టానికి ఛేదించింది.