న్యూఢిల్లీ: అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్లలో భారత బౌలర్ యజ్వేంద్ర చాహల్ తన పేరిట చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్లో.. చాహల్ ఆతిథ్య జట్టు బ్యాటర్లకు 5 సిక్సర్లు సమర్పించుకున్నాడు. దాంతో టీ20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో.. న్యూజీలాండ్ బౌలర్ ఇష్ సోధీతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
వెస్టిండీస్తో ఆఖరి మ్యాచ్లో ఇచ్చిన ఐదు సిక్సర్లతో కలిపి యజ్వేంద్ర చాహల్ టీ20 ఇంటర్నేషనల్స్లో మొత్తం 129 సిక్సర్లు సమర్పించుకున్నాడు. న్యూజీలాండ్ బౌలర్ సోధీ ఇప్పటికే 129 సిక్సర్లు ఇచ్చి టాప్లో ఉండగా.. ఇప్పుడు చాహల్ కూడా అతని సరసన చేరి చెత్త రికార్డును సమం చేశాడు. కాగా, భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు 3-2 తేడాతో ట్రోఫీని గెలుచుకుంది.