దుబాయ్: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా జడ్డూ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడని శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
‘జడేజా కుడి మోకాలికి గాయం కావడంతో టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు’ అని పేర్కొంది. జడేజా స్థానంలో స్టాండ్బై ప్లేయర్గా ఉన్న స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకున్నారు.