కొలంబో: శ్రీలంక టూర్లో ఉన్న ఇండియన్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లూ ఐసోలేషన్లో ఉన్నాయి. ఒకవేళ టీమ్స్లోని అందరు ప్లేయర్స్ నెగటివ్గా తేలితే.. బుధవారం ఈ రెండో టీ20 నిర్వహిస్తారు. ఆదివారం జరిగిన తొలి టీ20లో ఇండియా 38 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కృనాల్ ఆడాడు. రెండు ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రెండు రోజుల ముందే అతడు రెండు టీమ్స్లోని ప్లేయర్స్తో కలిసి ఆడాడు. దీంతో ఇంగ్లండ్లో ఉన్న టెస్ట్ టీమ్తో కలవాల్సిన ఉన్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వి షా ప్రయాణంపై ఇది ప్రభావం చూపనుంది. ఈ ఇద్దరూ అక్కడ గాయపడిన శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో వెళ్లాల్సి ఉంది.