ముంబై: చైనా కంపెనీ వీవోకు గుడ్బై చెప్పింది ఐపీఎల్. ఇండియాలోని అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూపు.. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మెన్ బ్రిజేష్ పటేల్ ద్రువీకరించారు. ఇవాళ జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. టాటా గ్రూపు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ఎంపికవడం నిజమే అని ఆయన అన్నారు. ఐపీఎల్ స్పాన్సర్గా వ్యవహరించేందుకు 2200 కోట్లకు వీవో డీల్ కుదుర్చుకున్నది. 2018 నుంచి 2022 వరకు చైనా మొబైల్ కంపెనీ వీవో ఆ ఒప్పందానికి అంగీకరించింది. అయితే గత ఏడాది గాల్వాన్లో జరిగిన ఘర్షణ కారణంగా.. చైనా, భారత్ మధ్య సంబంధాలు బలహీనపడిన విషయం తెలిసిందే.