న్యూఢిల్లీ: మేఘాలయలోని షాన్బంగ్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాప్ టెన్నిస్ ప్లేయర్ విశ్వ దీన్దయాలన్ (Vishwa Deenadayalan) మృతిచెందాడు. 83వ సీనియర్ నేషనల్, ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ నేడు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి తమిళనాడుకు చెందిన 18 ఏండ్ల విశ్వ మరో ముగ్గురు ఆటగాళ్లతో కలిసి గువాహటి నుంచి షిల్లాంగ్కు ఆదివారం సాయంత్రం ఓ కారులో బయలు దేశారు. ఈ క్రమంలో వారి కారును ఎన్హెచ్-6పై షాన్బంగ్లా వద్ద ట్రక్కు ఢీకొట్టింది.
దీంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. విశ్వతోపాటు అతని సహచర ఆటగాళ్లు రమేశ్ సంతోష్ కుమార్, అవినాశ్ శ్రీనివాసన్, కిశోర్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని దవాఖానకు తరలించగా.. అప్పటికే విశ్వ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారని చెప్పారు. విశ్వ మృతిపట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
కాగా, ఈ నెల 27 నుంచి ఆస్ట్రేలియాలో జరుగనున్న డబ్ల్యూటీటీ యూత్ టోర్నీలో భారత్కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉన్నది.