హైదరాబాద్: రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ సిద్ధాంత్ మురళీకుమార్ జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక స్పెషల్ ఒలింపిక్స్లో సత్తాచాటాడు. బుధవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన మురళీ 30.57సెకన్ల టైమింగ్తో మూడో స్థానంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. స్పెషల్ ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్గా మురళీ కుమార్ నిలిచాడు. దాయబ్(సిరియా), రోడ్రిగెజ్(పోర్చుగల్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో సాట్స్ కోచ్ ఆయూష్ యాదవ్ దగ్గర మురళీ శిక్షణ తీసుకుంటున్నాడు. భారత స్విమ్మింగ్ జట్టుకు ఆయూష్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.