ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. భారత స్టార్ పేసర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అదే జట్టుకు ఆడిన మహమ్మద్ షమీ.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడతాడని తాను అనుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
గుజరాత్ తరఫున పవర్ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం వేస్తున్న ప్రణాళికల్లో షమీకి స్థానం ఉందని తాను అనుకోవడం లేదని నెహ్రా కుండ బద్దలు కొట్టాడు. ‘‘షమీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడకపోవచ్చు. కానీ వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కోసం మాత్రం కచ్చితంగా అతన్ని పరిగణనలోకి తీసుకుంటుంది’’ అని నెహ్రా చెప్పాడు.
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లో షమీని ఎంపిక చేయని సంగతి తెలిసిందే. అలాగే ఐర్లాండ్తో టీ20లు ఆడే జట్టులో కూడా షమీకి స్థానం దక్కలేదు.