క్రికెట్లో పొట్టి ఫార్మాట్గా పిలవబడే టీ20 మ్యాచ్లు ఈ సంవత్సరం క్రికెట్ అభిమానులను బాగానే అలరిచాయి. 2020లో కరోనా కారణంగా నిలిచిపోయిన మ్యాచ్లన్నీ 2021లో జరిగాయి. ఈ సంవత్సరంలోనే టీ20 ప్రపంచకప్ కూడా జరిగింది. ఇందులో మొదటిసారి అస్ట్రేలియా ఛాంపియన్గా నిలిచింది. టీ20 అంటేనే తక్కువ బాల్స్లో ఎక్కువ పరుగుల వరదను చూపించడం. దానికోసం బ్యాట్స్మెన్ల సిక్సుల బాదుడు మామూలుగా ఉండదు.
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ 6 మ్యాచ్లలో 13 సిక్సులు బాదగా.. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రిజ్వాన్ 6 మ్యాచ్లలో 12 సిక్సులు కొట్టాడు.
2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్లు ముగియడంతో ఈ సంవత్సరంలో అత్యధిక సిక్సులు బాదిన టాప్ టెన్ ఆటగాళ్లు వీరే..
టాప్ టెన్ సిక్సుల వీరులలో భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక్కడే ఉండడం గమనార్హం.