కొలంబో: బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించిన శ్రీలంక క్రికెటర్లు కుషాల్ మెండిస్, నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్తో మంగళవారం వన్డే మ్యాచ్ ప్రారంభం కానుండగా.. డర్హమ్లో ఉన్న లంక క్రికెటర్లు ‘బుడగ’ దాటి బయటకు వచ్చారు. ఆటగాళ్లు వీధుల్లో తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దానిపై విచారణ చేపట్టిన లంక క్రికెట్ బోర్డు ముగ్గురిని సస్పెండ్ చేసి, స్వదేశానికి రావాలని సోమవారం ఆదేశించింది.