దుబాయ్ : ఐసీసీ టి20 బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో సూర్య భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ అతని అగ్రస్థానానికి ఢోకా లేకపోయింది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ 906 పాయంట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ ద్వయం మహ్మద్ రిజ్వాన్(811), కెప్టెన్ బాబర్ అజామ్(755) తరువాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్మ్(748), న్యూజిలాండ్కు చెందిన కాన్వే(748) తొలి అయిదు స్థానాలను భర్తీ చేశారు. కోహ్లీ 15వ స్థానంలోనే కొనసాగుతున్నాడు.